తిరుమల శ్రీవారి భక్తులతో ప్రాంక్ వీడియోలు తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులతో ఆకతాయిలు ప్రాంక్ వీడియోలు తీశారు. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ అనే భక్తుడు తన మిత్రులతో కలిసి ప్రాంక్ వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ప్రాంక్ వీడియోల చిత్రీకరణపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు టీటీడీని కోరుతున్నారు.