తిరుమల శ్రీవారిని మంగళవారం ఉగాది సందర్భంగా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళ సినీ నటుడు సంతానం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవాణి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆయనను చూసేందుకు, ఆయనతో ఫోటో లు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు.