మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా పేరును అహల్యానగర్గా మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరు మీదుగా అహ్మద్నగర్ను ‘అహల్యానగర్’గా మార్చాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్లను ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్గా మార్చడంతో అహ్మద్నగర్ జిల్లా పేరును కూడా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.