AP: పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలవరం గురించి వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. వీడియోలో అంబటి రాంబాబు మాటలు విని చంద్రబాబు పగలబడి నవ్వారు. 'పోలవరం ప్రాజెక్టు అంత తేలికగా అర్థం కాదు. ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి' అనే వ్యాఖ్యలు రాగానే సీఎం, మంత్రులు, అధికారులంతా నవ్వేశారు. పోలవరం వైసీపీ వాళ్లకు హాస్యమైందని సీఎం విమర్శించారు.