దేశంలో 11.4 శాతం ప్రజలకు మధుమేహం ఉన్నట్లు ఐసీఎంఆర్ గతేడాది విడుదల చేసిన ‘ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్’ వెల్లడించింది. 15.3 శాతం మంది పూర్వ మధుమేహ (ప్రీడయాబెటిక్) స్థితిలో ఉన్నట్లు తెలిపింది. మధుమేహం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 9.9%, ఆంధ్రప్రదేశ్లో 9.5% మందికి మధుమేహం ఉన్నట్లు నివేదిక తెలిపింది.