సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు తేతలి ప్రాంతం నుంచి ప్రారంభమైంది. బస్సు యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకుంటుంది. పొట్టిలంకలో సీఎం వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2 గంటలకు కడియపులంక చేరుకుంటారు, 3 గంటలకు రాజమండ్రి సిటీలోని మోరంపూడి జంక్షన్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి ఎస్టీ రాజపురం వద్ద బస చేస్తారు.