మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ఆ దేవుడికి, వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ తెలుసని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో.. వారి వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉందన్నారు. చిన్నాన్నను అతిదారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. హంతకుడిని చంద్రబాబు, అతడి ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటున్నాయని విమర్శించారు.