రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న మంగళగిరిలో ఓటేసిన తర్వాత ఆయన వారణాసికి వెళ్లారు. ఇవాళ ప్రధాని మోదీ వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీలో ఏన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపారు. మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు.