బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా సుశీల్ కుమార్ మోడీ క్యాన్సర్తో పోరాడుతున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్నానని.. ఆరోగ్య సమస్యల వల్ల లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు గత నెలలో ప్రకటించారు. మంగళవారం పాట్నా రాజేంద్ర నగర్ ప్రాంతంలోని ఆయన నివాసానికి సుశీల్ కుమార్ భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.