పవన్‌ కల్యాణ్‌పై ఈసీకి ఫిర్యాదు

61చూసినవారు
పవన్‌ కల్యాణ్‌పై ఈసీకి ఫిర్యాదు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఈసీకి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. బకెట్ గుర్తు ఉన్న త‌మ పార్టీని ఎన్నిక‌ల్లో పోటీ చేయొద్దని పవన్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. "జనసేన గాజు గ్లాసు గుర్తు, నా పార్టీ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుంది. అందుకే నా పార్టీ పోటీ చేయకూడదని బెదిరిస్తున్నారు. రూ.5 కోట్లు ఇస్తానని పవన్ చెప్పాడు. పవన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి." అని జ‌లీల్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్