ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా
వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రెస్మీట్లు పెట్టి విపక్షాలపై ఆరోణలు చేస్తున్నారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనను ఆ పదవి నుంచి తొలగించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.