జీపును డివైడర్ ఎక్కించి రోడ్డు దాటారు (VIDEO)

155760చూసినవారు
విజయవాడలో సోమవారం రాత్రి యువకులు వీరంగం చేశారు. బందర్ రోడ్డులో జీపులో వెళ్తూ ప్రయాణికులను భయాందోళనకు గురి చేశారు. కొందరైతే పరుగులు పెట్టారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జీపుతో యువకులు మితిమీరిన వేగంతో డివైడర్ ను ఎక్కించి రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో జీపులో యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్