AP: భూ కుంభకోణాలకు పాల్పడ్డ సీఎస్ జవహర్ రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విశాఖలో అసైన్డ్ భూములను దోచుకున్న సీఎస్పై సీబీఐ కేసు నమోదు చేయాలన్నారు. కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ఫైర్ అయ్యారు. పేదల భూములు తక్కువ ధరకు కొట్టేయడమే పనిగా పెట్టుకున్నారా? అని వర్ల ధ్వజమెత్తారు.