VIDEO: కుప్పకూలి చనిపోయిన ఓటర్

72చూసినవారు
లోక్‌సభ ఏడో దశ ఎన్నికల్లో భాగంగా శనివారం యూపీలోని బల్లియాలో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో విషాద ఘటన జరిగింది. ఓటు వేయడానికి లైన్‌లో నిల్చున్న ఓ వ్యక్తి వడదెబ్బ కారణంగా స్పృహ తప్పి పడిపోయాడు. చుట్టు పక్కల వాళ్లు ఆ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.

సంబంధిత పోస్ట్