ఏపీకి తుఫాను ముప్పు.. భారీ వర్షాలు

67చూసినవారు
ఏపీకి తుఫాను ముప్పు.. భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారనుంది. బుధవారం తుఫానుగా బలపడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 23, 24 తేదీల్లో తీరం వెంబడి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్