రేపటికి తీవ్ర తుపానుగా ‘దానా’

77చూసినవారు
‘దానా’ తుపాను రేపటికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి గంటకు 80-100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లిన వారిని భారత కోస్టు గార్డులు అప్రమత్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్