ఏపీలో దంచికొట్టిన వ‌ర్షం(వీడియో)

35764చూసినవారు
ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. క‌ర్నూలు, నంద్యాల, తిరుప‌తి, అన్న‌మ‌య్య జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వాన‌లు ప‌డుతున్నాయి. క‌ళియుగ వైకుంఠం తిరుమ‌లలో ఒక్కసారిగా కుండ‌పోత వర్షం కురిసింది. జోరు వాన పడటంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిముద్దయింది. రాష్ట్రంలో రానున్న 4 రోజులు పిడుగులతో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాత‌వ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్