వ్యవసాయ పంప్సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం టారిఫ్ ద్వారా రూ.16,699 కోట్లు, ట్రూ అప్ ద్వారా రూ.5,886 కోట్లు, ఇంధన ఛార్జీలు రూ.3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో రూ.5,607 కోట్ల మేర వసూలు చేశారన్నారు. విద్యుత్రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం సాయం తీసుకుంటామన్నారు.