గంజాయి, డ్రగ్స్కు విశాఖ రాజధానిగా మారిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా.. మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయని మండిపడ్డారు. గంజాయిని కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. బీజేపీపై బురద జల్లడం మానుకోవాలని సూచించారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్పై లోతైన విచారణ జరిపించాలని కోరారు.