ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్సీ కాలనీలో ఘోరం జరిగింది. బైక్పై వెళ్తుండగా హైటెన్షన్ తీగలు మీదపడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాల తెలియాల్సి ఉంది.