సీఎం జగన్పై రాయి విసరడం ముమ్మాటికీ తప్పేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అయితే దీనిని వైసీపీ రాజకీయం చేయడం సరికాదని విమర్శించారు. అధికార, ప్రతిపక్ష నేతలపై రాళ్ల దాడి జరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సీఎం జగన్పై దాడికి డీజీపీ బాధ్యత వహించాలని.. వెంటనే డీజీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.