రూ.48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా?: విజయసాయిరెడ్డి

62చూసినవారు
రూ.48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా?: విజయసాయిరెడ్డి
ఏపీ కోసమే ఎన్డీఏ బడ్జెట్ కేటాయించినట్లు గొప్పలు చెప్పుకోవడం దారుణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. 'బడ్జెట్‌లోని మొత్తం రూ.48 లక్షల కోట్ల ఏపీకే ఇచ్చారా? ఆ రాష్ట్రానికే మొత్తం నిధులు ఇచ్చినట్లు ఇండియా కూటమి ఏడుస్తోంది. రూ.15 వేల కోట్లు ఏపీకి అప్పుగా మాత్రమే ఇచ్చింది. ఆ అసలు, వడ్డీని ఆ రాష్ట్ర ప్రజలే తిరిగి కట్టాలి' అని ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్