క్రిమినల్ కేసులు ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చిందో వైసీపీ చెప్పాలని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న వారికి టికెట్ ఇవ్వడంపై వైసీపీ తన వెబ్సైట్లో వివరణ ఇవ్వాలన్నారు. "అవినాష్ నేరచరిత్రపై ఈసీకి ఎందుకు తెలపలేదు? అభ్యర్థిపై క్రిమినల్ కేసులుంటే అఫిడవిట్లో తెలపాలి. కానీ ఈ నిబంధనలన్నీ వైసీపీ తుంగలో తొక్కింది. నేర చరిత్ర కలిగిన హంతకులకు ఎన్నికల్లో ఓటు వేయొద్దు." అని సునీత కోరారు.