కొవ్వూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 20 లక్షల ఖరీదు చేసే కంటి పరీక్ష శస్త్ర చికిత్స పరికరాలు దాతల సహకారంతో అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు సామజిక ఆరోగ్య కేంద్రంలో కంటి చికిత్స యూనిట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సహాయ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.