తప్పుడు వివరాలు ఉంటే కేసులు నమోదు: నగర కమిషనర్

73చూసినవారు
తప్పుడు వివరాలు ఉంటే కేసులు నమోదు: నగర కమిషనర్
రాజకీయ పార్టీలు సమర్పించే పత్రాలపై తప్పుడు వివరాలు ఉంటే కేసులు నమోదు చేస్తామని రాజమండ్రి నగర కమిషనర్, అర్బన్ ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్లపై పేరు, అడ్రసు, ప్రింటర్ పేర్లు స్పష్టంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని అన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.

సంబంధిత పోస్ట్