కులం, మతం ప్రస్తావనొస్తే చర్యలే: కమిషనర్

52చూసినవారు
సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ నాయకులు కులాన్ని, మతాన్ని ఉద్దేశించి సమావేశాలు నిర్వహించినా ఎవరినైనా దూషించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అన్నారు.

సంబంధిత పోస్ట్