May 13, 2024, 13:05 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
ఏజెంట్ల తీరుపై ఓటర్లు ఉక్కిరిబిక్కిరి
May 13, 2024, 13:05 IST
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏజెంట్ల తీరుపై ఓటర్లు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓటు వేయడానికి వచ్చిన మహిళలను ఏజెంట్లు ఆరా తీశారు. ఏజెంట్లు కేవలం గుర్తింపు కార్డులతో సరిచూసుకోవాలి కానీ వారి వివరాలు పూర్తి వివరాలు సేకరించడంతో ఓటు వేయడానికి వచ్చిన వారితో పాటు క్యూలో నిలబడ్డవాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి క్యూలో లైన్ల వేచి ఉన్నారు.