కడియం మండలం మాధవరాయుడు పాలెం శివారు చైతన్య నగరంలో ముంజేటి సురేష్ మద్యం తాగి బాటిల్ రోడ్డుపై పగలగొట్టాడు. దీంతో వార్డు సభ్యుడు బళ్ల ధనుంజయ రాజు మందలించగా సురేష్ అతనిపై కూల్ డ్రింక్ బాటిల్తో పలుమార్లు దాడి చేశాడు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలైనట్లు డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తులసీదర్, ఎస్సై టి. కృష్ణ సాయి శనివారం చెప్పారు.