గోకవరం ఎస్ఐ కూన నాగరాజు పెంటపల్లి గ్రామస్తులతో శుక్రవారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటార్ సైకిల్ పై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించి అన్ని రికార్డులు సక్రమంగా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే బాధితుల కుటుంబానికి అన్యాయం జరుగుతుందని ఈసందర్భంగా తెలిపారు. వాహనదారునికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు.