సీఎం జగన్ను ఉద్దేశిస్తూ ఆయన ఓ పరదాల మహారాణి అంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి కోరుకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సూరంపాలెంలో ఓ కళాశాల విద్యార్థులు నిన్న సీఎం జగన్కి వ్యతిరేకంగా చేసిన నినాదాలపై ఆయన స్పందించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్ విద్యార్థులతో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.