ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం మావోయిస్టుల ఆందోళనల కారణంగా నిత్యం వార్తల్లో వినిపిస్తోంది. ఈ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చినా ప్రజలు పట్టించుకోలేదు. నిన్న జరిగిన పోలింగ్లో ఆ సెగ్మెంట్లో 67.56% మంది ఓటు వేశారు. అయితే కరడుగట్టిన మావోయిస్టు నేత హిద్మాకు చెందిన పువర్తి గ్రామంలో ఎవరూ ఓటు వేయలేదు. భయంతో ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు.