కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై కేసు నమోదైంది. బెంగళూరు రూరల్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన డీకే సురేశ్ను గెలిపిస్తే కావేరీ నది నుంచి తాగునీటిని తీసుకొచ్చి ప్రజల దాహార్తి తీరుస్తానని హామీ ఇచ్చారు. ఓటు వేస్తే నీళ్లు ఇస్తామని చెప్పడంతో ఆయనపై ఈసీ ఆదేశాల మేరకు బెంగళూరు పోలీసులు FIR నమోదు చేశారు.