ప్రజలకు తాగునీరు, సాగునీరు అందడం లేదు: బత్తుల

82చూసినవారు
గోదావరి నది పక్కనే ఉన్న రాజానగరం నియోజవర్గ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందడం లేదని నియోజకవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి కోరుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో నియోజకవర్గ రైతులకు అన్ని విధాలుగా సహకారాలు అందించాలని పవన్ కళ్యాణ్ ను కోరారు. ఐక్యమత్యంతో జనసేన గెలుపుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్