రాజానగరం స్కాములకు, గంజాయి, ఇసుక దోపిడికి అడ్డాగా మారిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం రాత్రి కోరుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సరైన పాలకుడిని ఎన్నుకోకపోతే హింసాత్మక సంస్కృతి తూ. గో జిల్లా వరకు వచ్చిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ గుండాల తాట తీస్తామని హెచ్చరించారు.