తిరుమలను జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసింది: ఎమ్మెల్యే

52చూసినవారు
ప్రపంచమంతా పవిత్రంగా భావించే తిరుమలను జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకాన్ని నిరసిస్తూ అనపర్తిలో హిందూ ధార్మిక సంఘాలతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోమవారం ర్యాలీ చేపట్టారు. మెయిన్ రోడ్డు నుంచి దేవి చౌక్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.

సంబంధిత పోస్ట్