
అనపర్తి: రైతులకు సమాచారం లేకుండానే పలు చోట్ల ఎలుకల మందు పంపిణీ
పెదపూడి మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల మందు పంపిణీ జరిగింది. సదురు కార్యక్రమంపై పలు గ్రామాలలోని రైతులకు, కనీస సమాచారం అందలేదని, నాయకులు, ఉన్నతాధికారులు మెప్పు కోసం మాత్రమే వ్యవసాయశాఖ అధికారులు పనిచేస్తున్నారంటూ రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరలా రైతులకు ఎలుకల మందు పంపిణీ చేపట్టాలని కోరుతున్నారు.