గత 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడ నగర పాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ కాకినాడలో సోమవారం ఆందోళన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి ఇస్మాయిల్ మాట్లాడుతూ 2022 నుండి క్లాప్ వాహన డ్రైవర్స్ కు ఏనాడూ సకాలంలో జీతాలు అందలేదన్నారు. ఇటీవల జీతాలు గురించి అధికారులకు విన్నవించామన్నారు.