టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉమ్మడి జిల్లా టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గా సానా సతీష్ ని నియమించారు. ఈ సందర్భంగా కాకినాడలోని ఆయన కార్యాలయంలో సోమవారం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలపై ఆయన చర్చించారు.