విశాఖ డ్రగ్స్ సరఫరా వెనుక వైకాపా నేతల హస్తం ఉందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆరోపించారు. మండపేట టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాలో వైకాపా నేతలు ఉన్నారని తెలుసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విశాఖను స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని డ్రగ్ క్యాపిటల్ గా మార్చారన్నారు.