స్వైన్ ఫ్లూపై కాకినాడలో వైద్య శిబిరాలు

1482చూసినవారు
సైన్ ఫ్లూ తో మండపేట 25 వ వార్డ్ పరిధి లోని గాంధీనగర్ 2వ వీధి కి చెందిన గోరు సతీష్ కుమార్(38)ప్రస్తుతం కాకినాడ జిజి హెచ్ లో చికిత్స పొందుతున్నట్లు మండపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ కె జనార్దన్ బాబు వెల్లడించారు. గత నెల 26 న సైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు తాము గుర్తించి రాజనగరం జి ఎస్ ఎల్ కు తరలించమని చెప్పారు. అక్కడ వైద్యులు సైన్ ఫ్లూ గా నిర్ధారించగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. కాగా అదే వీధి లో తమ సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడి వారి రక్త నమూనాలు సేకరించి, మెడికల్ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. శనివారం ప్రత్యేక వైద్య శిబిరం గాంధీ నగర్ 2 వ వీధి లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందస్తు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్