వర్షపు నీటిలో స్థానికులు ఆందోళన

63చూసినవారు
సుంకరపాలెం వర్తకసంఘం ప్రతినిధులు, పరిసర ప్రాంతాలలో నివాసముంటున్న గ్రామస్థులు వర్షపు నీటిలో గురువారం ఆందోళన చేశారు. బైపాస్ సుంకరపాలెం జంక్షన్ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు రహదారి మోకాలులోతు వర్షపు నీరుతో నిండిపోయిందని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. వర్షాలు కురుస్తున్న సమయంలో రహదారిపై ప్రయాణించేవారు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్