నిడదవోలు కూటమి అభ్యర్థిగా కందుల దుర్గేష్ నామినేషన్

584చూసినవారు
నిడదవోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, వారి ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ శేషారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్