పెరవలి మండలం కొత్తపల్లిలో మంగళవారం ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు తనయుడు వరుణ్ సాయి మంగళవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ నాయుడుని మరల ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.