ఏపీఎన్డబ్ల్యూసీ గోదామును పరిశీలించిన జాయింట్ కలెక్టర్

73చూసినవారు
ఏపీఎన్డబ్ల్యూసీ గోదామును పరిశీలించిన జాయింట్ కలెక్టర్
జిల్లాలో భారీ వర్షాలు, ఏలేరు ప్రాజెక్ట్ వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలలో ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్న సామర్లకోటలోని ఏపీఎన్డబ్ల్యూసీ గోదామును శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులతో కలిసి సందర్శించారు. వరద బాధితులకు అందించేందుకు ప్యాకింగ్ చేస్తున్న వస్తువుల నాణ్యతను జేసీ ఈ సందర్భంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్