చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

85చూసినవారు
చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ
విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యలయంలో సీఎం చంద్రబాబు నాయుడును పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓ పుస్తకం తయారు చేసి చంద్రబాబుకు వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు వర్మ తెలిపారు. ఆయనతో పాటు పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్