వైభవంగా ముగిసిన వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో గ్రామ దేవత వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారంతో వైభవంగా ముగిసాయి. ఆఖరి రోజున అమావాస్య కావడంతో ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మూల విరాట్ కు రజత కవచ అలంకరణ చేసి సర్వదర్శనాలు కల్పించారు. భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. జాతర మహోత్సవంలో భాగంగా తీన్మార్, గరగలు, డప్పు వాయిద్యాలు, భజన బృందాలతో బాణసంచాలతో వైభవంగా నిర్వహించారు.