గొల్లప్రోలులో రహదారిపై జగనన్న కాలనీవాసులు నిరసన

60చూసినవారు
గొల్లప్రోలు శివారులోని జాతీయ రహదారిపై జగనన్న కాలనీ వాసులు మంగళవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం మారినా తమను పట్టించుకునే నాథుడే లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీ అంతా మునిగిపోయిందని వాపోయారు. జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చిన నాయకులు ఎవరూ తమకు కనిపించడం లేదని హైవేపై బైఠాయించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్