భారత చైతన్య యువజన పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తమన్నా సింహాద్రి బుధవారం పిఠాపురం పట్టణంలో ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చట్ట సభల్లో తమకు స్ధానం కల్పించాలని, ట్రాన్స్ జెండర్ హక్కుల సాధన కోసం పోరాడేందుకు ముందుకు వచ్చానని మీడియాకు తెలియజేశారు.