రాజమండ్రిలో గంజా, బ్లేడ్ బ్యాచ్లను ఎంపీ మార్గాని భరత్ పోషిస్తున్నారని, తనకు ఏమీ సంబంధంలేని విషయంలో లాగితే ఊరుకునేది లేదని గోరంట్ల అన్నారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ గంజాయి కేసులో ఎంపీ భరత్ ప్రమేయం లేదా? అని ప్రశ్నించారు. కంటెయినర్ ఓపెన్ చేయకుండా వైసీపీ ఎందుకు అడ్డుకుంటుందన్నారు. తప్పులను వేరొకరి మీదకు నెట్టివేయడం భరత్కు అలవాటేనని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.