ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

246130చూసినవారు
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కొత్త మాధవరంకు చెందిన సుబ్బారావు, పద్మావతి దంపతులు. వీరికి మూడెకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని అమ్ముదామనుకుంటే రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసినట్లు దంపతులు ఆరోపించారు. తీవ్ర మనస్థాపానికి గురైన పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఉరేసుకున్నారు. భర్త సుబ్బారావు రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ లభించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్